News

బాబూరావుకు టిడిపి మద్దతు ఇస్తొంది:రోజా


రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్ బాబూరావుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తోందని ఎమ్మెల్యే, రోజా ప్రశ్నించారు. సిఎం చంద్రబాబు నాయుడు కుటుంబంలోని అక్క,చెల్లో, మరొకరు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే ప్రవర్తిస్తారా అని ఆమె అన్నారు. రిషితేశ్వరి తల్లిదండ్రులను మొదట పట్టించుకోలేదని, తాము ఆందోళన చేస్తే అప్పుడు వారికి స్థలం, డబ్బు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని, అది పరిష్కారమా? న్యాయం జరగడం ముఖ్యమా అని ఆమె ప్రశ్నించారు. ప్రిన్సిపాల్ ను మొదటి ముద్దాయిగా చేయాలని, ఆయన తాగి తందనాలు ఆడడడం వీడియోలలో కూడా వచ్చిందని, ఆడపిల్లలతో అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.